అమలాపురంలోని చెన్న మల్లేశ్వరస్వామి ఆలయం ఎదురుగా గతంలో రూ. 4 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభ శిలాఫలకాన్ని తొలగించి దాన్ని శుక్రవారం తీసుకుపోయారు. రెండేళ్ల క్రితం ఈ రోడ్డును అప్పటి రవాణా శాఖమంత్రి పినిపే విశ్వరూప్ ప్రారంభించారు. శిలాఫలకం తొలగింపు, దాన్ని మాయం చేయడంపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.