గడ్డి మందు తాగిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉప్పలగుప్తం మండలం చినగాడవల్లిలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ (24) అనే యువకుడు వ్యక్తిగత కారణాలతో పురుగు మందు తాగాడు. తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో అతని కుటుంబ సభ్యులు ఈనెల 8న కాకినాడ జీజీహెచ్ లో చేర్చారు. చికిత్సపొందుతూ శుక్రవారం మృతిచెందాడు. ఘటనపై ఉప్పలగుప్తం పోలీసులు కేసు నమోదు చేశారు.