రాక్ సిరామిక్స్లో 90 మంది కార్మికుల తొలగింపుపై నిరసనగా కార్మికులు ఆందోళన చేపట్టారు. శనివారం సామర్లకోటలో జరిగిన ఆందోళనకు సీఐటీయూ మద్దతు తెలిపింది. జిల్లా కార్యదర్శులు దారపురెడ్డి క్రాంతికుమార్, బాలం శ్రీనివాస్ కార్మికులను మద్దతుగా నిలిచారు. కార్మికుల తొలగింపును వారు ఖండించారు.