బిక్కవోలు మండలం కొమరిపాలెం రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ పురందేశ్వరి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.