పెదపూడి మండలం సంపర గ్రామంలో పోలేరమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వెళ్ళిన ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి పూజల అనంతరం ఘనంగా సత్కరించారు.