తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ప్రశాంతిని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శనివారం రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా చాగల నాడు, వెంకటపురం, పుష్కర ఎత్తిపోతల పథకాలకు నిధులు మంజూరు చేయాలని కోరారు.