భారత సైన్యానికి ప్రతి భారతీయుడు అండగా నిలవాలని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. భారత సైన్యానికి సంఘీభావంగా శుక్రవారం సాయంత్రం అనపర్తిలో కూటమి శ్రేణులు అధికారులతో కలిసి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శాంతియుత ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో వందేమాతరం అంటూ నినాదాలు చేస్తూ గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర చేశారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.