అనపర్తి మండలంలోని వివిధ గ్రామాల్లో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఈఈ దాట్ల శ్రీధర్ వర్మ తెలిపారు. అనపర్తి, పీరా రామచంద్రపురం సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతులు చేస్తున్న నేపథ్యంలో అనపర్తి, దుప్పలపూడి, పీరా రామచంద్రపురం గ్రామాల్లో శుక్రవారం ఉదయం8 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.