తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో బీజేపీ అభ్యర్థికి తెలుగుదేశం నేతలు షాకిచ్చారు. బిక్కవోలులోని లక్ష్మీ గణపతి ఆలయంలో పూజలు చేసి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన అనపర్తి కూటమి అభ్యర్థి శివరామకృష్ణం రాజును తెలుగు తమ్ముల్లు అడ్డుకున్నారు. నామినేషన్ వేసేవరకు టీడీపీ కండువా మెడలో వేసుకోవద్దంటూ వారించారు. దీంతో బీజేపీ నేత కండువాను తీసారు. అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది.