భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపారని పి. గన్నవరం వైసీపీ ఇంచార్జ్ గన్నవరపు శ్రీనివాస్ అన్నారు. అయినవిల్లి మండలం తొత్తరమూడిలో అంబేడ్కర్ జయంతి మాస ఉత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.