అయినవిల్లి మండలం బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు కుడుపూడి చంద్ర శేఖర్ ఆధ్వర్యంలో దేశ భద్రత కోసం జరుగుతున్న ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవ్వాలని కోరుతూ బీజేపీ నేతలు శనివారం అయినవిల్లి వరసిద్ధి వినాయకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పి.గన్నవరం కన్వీనర్ చీకరుమెల్లి వెంకటేశ్వరరావు, జిల్లా వైఎస్ ప్రెసిడెంట్ చేరుకూరి గోపాలకృష్ణ, ఓబిసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.