ఏ సమయంలో వర్షం పడుతుందా తెలియక రైతుల అవస్థలు పడుతున్నారు. అయినవిల్లి మండలం పలు గ్రామాలలో ధాన్యాన్ని రైతులు శుక్రవారం ఉదయం నుంచి ఎండ కాస్తుండడంతో ఎండబెట్టుకున్నారు. అయితే వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో రైతులు ఏమి చేయాలో తెలియక పరుగులు పెట్టారు. ధాన్యం పూర్తిగా ఆరితే మిల్లులకు తరలించాలని చూస్తున్నారు. కానీ వాతావరణం శుక్రవారం మధ్యాహ్నం నుంచి మారి పోయి పూర్తి మేఘావృతం అయ్యి మళ్ళీ ఎండ కాస్తుంది. దింతో రైతులు ధాన్యం వద్దే కాపలా కాస్తున్నారు.