అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారిని బుధవారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి బుధవారం వివిధ సేవల ద్వారా రూ. 3, 36, 849 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 304 మంది స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. అన్నదాన ట్రస్ట్ ద్వారా 2800 మంది అన్న ప్రసాదం స్వీకరించారని తెలిపారు.