అయినవిల్లి: విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం రూ. 3.81 లక్షలు

73చూసినవారు
అయినవిల్లి: విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం రూ. 3.81 లక్షలు
అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారిని శనివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి వివిధ సేవల ద్వారా రూ. 3, 81, 835 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 465 మంది స్వామి వారిని దర్శించుకున్నారని పేర్కొన్నారు. 2485 మంది అన్న ప్రసాదం స్వీకరించారని చెప్పారు.

సంబంధిత పోస్ట్