అయినవిల్లి మండలం అయినవిల్లిలో వేంచేసి ఉన్న రాష్ట్రవ్యాప్త ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి వారి ఆలయానికి శుక్రవారం భక్తులు రాష్ట్ర నలుమూలల నుండి భారీగా విచ్చేశారు. ఈ సందర్భంగా భక్తులు నిర్వహించిన వివిధ సేవల ద్వారా స్వామివారి ఆలయానికి రూ. 1, 65, 679 ఆదాయం లభించింది అని ఆలయ అధికారులు తెలియజేశారు. 1800 మంది స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారని వారు తెలియజేశారు.