అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారిని శనివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి శనివారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ. 2,50,942 లు ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 353 మంది స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. అన్నదాన ట్రస్టు ద్వారా 2400 మంది అన్న ప్రసాదం స్వీకరించారని తెలిపారు.