అయినవిల్లి మండలం అయినవిల్లిలోని కోనసీమ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విఘ్నేశ్వర స్వామి వారి ఆలయానికి గురువారం భక్తులు భారీగా పోటెత్తారు. ఈ నేపథ్యంలో భక్తులు నిర్వహించిన వివిధ సేవల ద్వారా స్వామివారి ఆలయానికి రూ 1, 77, 140 ఆదాయం లభించిందని ఆలయ అధికారులు వెల్లడించారు. దానితోపాటుగా స్వామివారి ఆలయంలో అన్నదానానికి రూ 95, 391 ఆదాయం లభించింది అన్నారు.