అయినవిల్లి మండలం అయినవిల్లిలో వేంచేసి ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విగ్నేశ్వర స్వామి వారి ఆలయంలో ఆదివారం జేష్ట మాసం బహుళ చవితి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు నిర్వహించిన వివిధ సేవల ద్వారా స్వామివారి ఆలయానికి రూ 3, 35, 368 ఆదాయం లభించిందని ఆలయ అధికారులు వెల్లడించారు. 2, 750 మంది స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు అన్నారు.