అయినవిల్లిలో వేంచేసి ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విగ్నేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం ఆషాఢ మాసం శుద్ధ దశమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు నిర్వహించిన వివిధ సేవల ద్వారా స్వామివారి ఆలయానికి రూ. 3,27,308 ఆదాయం లభించిందని ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు చెప్పారు. 2600 మంది స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు అన్నారు.