అప్పనపల్లి: బాలబాలాజీ ఆలయానికి రూ 4. 06 లక్షల ఆదాయం

53చూసినవారు
మామిడికుదురు మండలం అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి వారి ఆలయానికి శనివారం కావడంతో కోనసీమలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో భక్తులు నిర్వహించిన వివిధ సేవల ద్వారా స్వామివారి ఆలయానికి రూ 4, 06, 417 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో సత్య నారాయణరాజు తెలిపారు. 5, 500 మంది భక్తులు స్వామిని దర్శించుకున్నరని అన్నారు. 3200 మంది స్వామి వారి అన్న ప్రసాదం స్వీకరించారన్నారు.

సంబంధిత పోస్ట్