అప్పనపల్లి: సైనికులకు మద్దతుగా బీజేపీ నేతల పూజలు

56చూసినవారు
ఆపరేషన్ సింధూర్ లో పాల్గొంటున్న సైనికులకు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని బీజేపీ కోనసీమ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ సూచించారు. సైనికులకు మద్దతుగా మామిడికుదురు మండలం అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి ఆలయంలో శనివారం పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వేమా ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. త్రిపర్ణ పతాకాలను ప్రదర్శిస్తూ వందే మాతరం, జైజవాన్. జైజై జవాన్ అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్