పి. గన్నవరం మండలంలోని డొక్కా సీతమ్మ గోదావరి బ్రిడ్జిని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గోదావరి బ్రిడ్జి అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై కలెక్టర్ తో చర్చించారు. గత ఐదేళ్లుగా అభివృద్ధికి నోచుకోకపోవడంతో బ్రిడ్జి అధ్వానంగా మారిందని తెలియజేశారు.