ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని కోరుతూ ద్రాక్షారామ లో వున్న భీమేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలోని సత్యనారాయణ స్వామి ఆలయంలో బీజేపీ నాయకులు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత్-పాక్ యుద్ధం నేపథ్యంలో భారత సైనికులకు విజయం చేకూర్చాలని భగవంతునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వారి శ్రేయస్సుకు దైవ బలం అండగా ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం రూరల్ అధ్యక్షులు ఆకేటి శ్రీకృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు పేయ్యల రాంబాబు, బీజేపీ నేతలు పాల్గొన్నారు.