కోనసీమలో ప్రముఖ పుణ్య క్షేత్రాలైన వాడపల్లి, అయినవిల్లి, అప్పనపల్లి క్షేత్రాలకు బస్సు సౌకర్యం ఏర్పాటుపై రావులపాలెం ఆర్టీసీ డీఎం శనివారం రూట్ సర్వే నిర్వహించారు. జేసీ ఆదేశాల మేరకు రెండు రోజుల్లో బస్సు సౌకర్యం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారని అప్పనపల్లి దేవస్థానం ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. టెంపుల్ టూరిజం డెవలప్ మెంట్ కు ఇస్తున్న ప్రాధాన్యత రీత్యా భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.