పి.గన్నవరం: గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం పంపిణీ

76చూసినవారు
పి.గన్నవరం: గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం పంపిణీ
ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ కార్యక్రమంలో భాగంగా పి. గన్నవరం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో శుక్రవారం వేణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందజేశారు. ఈ కార్యక్రమాన్ని అమలాపురం ది చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కల్వకొలను తాతాజీ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించినందుకు ఆనందంగా ఉంది అన్నారు. సుమారు 250 మందికి పౌష్టికాహారం అందించడం జరిగిందని ఫౌండేషన్ చైర్మన్ తెలిపారు.

సంబంధిత పోస్ట్