పి. గన్నవరం: సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక చేయూత

68చూసినవారు
రాజకీయ పార్టీలకు అతీతంగా ఆపదలో ఉన్న పేద ప్రజలందరికీ ముఖ్య మంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక చేయూతను అందిస్తున్నామని పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. పి. గన్నవరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నియోజకవర్గంలోని 15 మందికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 7, 47, 289 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ ఛైర్మన్ నామన రాంబాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్