క్రియాశీలక సభ్యులు యాక్సిడెంట్లకు గురైనపుడు వారికి రూ. 5 లక్షల బీమా వర్తిస్తుందని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. పి. గన్నవరం మండలం పి. గన్నవరంలో క్రియాశీలకు సభ్యులకు కిట్స్, ఐడి కార్డులను ఆయన శుక్రవారం పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ కోసం కష్టపడిన వారికి తప్పనిసరిగా తగిన గుర్తింపు లభిస్తుంది అన్నారు.