ఆరికిరేవుల గ్రామంలో జంగిల్ క్లీనింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. 12న జాతర సందర్భంగా గోదావరి నది ఏటి గట్టు వద్ద జంగిల్ క్లీనింగ్ పనులు చేపట్టారు. కొవ్వూరు నుంచి పోలవరం వెళ్లే రోడ్డు ఇరువైపులా, చెట్లు, చెత్తా చెదారాలతో, నీరు నిల్వ ఉండడంతో శనివారం ఉదయం నుంచి జేసీబీతో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. పంచాయతీ కార్యదర్శి జె. నరేంద్రబాబు పర్యవేక్షణలో ఈ పనులు వేగంగా జరుగుతున్నాయి.