దేవరపల్లి భాష్యం స్కూల్ ప్రాంగణంలో దేవరపల్లి బలోత్సవం, చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపును బలోత్సవం కమిటీ ప్రతినిధి ఉండవల్లి కృష్ణారావు శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. మే 9వ తేదీ నుండి మే 20వ తేదీ వరకు భాష్యం స్కూల్ ప్రాంగణంలో ఉదయం తొమ్మిదిగంటల నుండి పన్నెండు గంటల వరకు సమ్మర్ క్యాంపు ను ఉచితంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ క్యాంపు నందు యోగా, ధ్యానం, చిత్రలేఖనం తదితర వాటికీ శిక్షణ అందించనున్నారు.