గోపాలపురం నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి అభివృద్ధి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు శనివారం అన్నారు. దుద్దుకూరు గ్రామంలో గ్రామ దర్శిని కార్యక్రమంలో పాల్గొన్న అయన మాట్లాడుతూ గ్రామ నాయకులు, ప్రజలతో నేరుగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ నియోజకవర్గంలోనే అభివృద్ధి పనుల్లో పరుగులు పెడుతుందని అన్నారు. గ్రామ కమిటీ అధ్యక్షుడు తాతారావు, గాలిoకి రాజు, కడియo సూర్యనారాయణ తదితరులు పాల్గోన్నారు.