దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామంలో గురువారం రాత్రి నూతన గ్రామ కమిటీ అధ్యక్షుడు నియామకం జరిగింది. గ్రామ నాయకులు నూతన గ్రామ కమిటీ అధ్యక్షులుగా కొయ్యలమూడి తాతారావుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా కడియం సూర్యనారాయణ, సెక్రటరీగా మల్లిపూడి సుబ్బారావుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నుకోబడ్డ నాయకులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేసి గ్రామ అభివృద్ధికి మరింత కృషి చేస్తామని అన్నారు.