గండేపల్లి మండలం పోలీసులు సోమవారం ఐదుగురు పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. మండలంలోని నీలాద్రి రావు పేట గ్రామ శివారులోని పోలవరం కాలువ గట్టుపై పేకాడుతున్న ఐదుగురని అరెస్టు చేశారు. మీరు వద్ద నుంచి
10, 400 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని జగ్గంపేట సీఐ వై ఆర్ కె శ్రీనివాస్ తెలిపారు. ఎవరైనా జూదాలు, క్రికెట్ బెట్టింగులు నిర్వహిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడుల్లో గండేపల్లి ఎస్సై శివ బాబు సిబ్బంది పాల్గొన్నారు.