మల్లిసాల అడ్డుకొండ భూమిలో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జగ్గంపేట మండలం మల్లిసాల, గండేపల్లి మండలం కే. గోపాలపురం మధ్య నున్న అడ్డుకొండ భూములను నిరుపేదలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.