జగ్గంపేట: ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

85చూసినవారు
జగ్గంపేట: ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
జగ్గంపేట, గండేపల్లి మండల కేంద్రాల్లో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలను జగ్గంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలనేదే కూటమి ప్రభుత్వ విధానమన్నారు. మూడు నెలలపాటు శిక్షణ అనంతరం ఉచితంగా కుట్టు మిషన్ ఇచ్చి వారికి ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్