జగ్గంపేట ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న జగ్గంపేట, కిర్లంపూడి, గండేపల్లి మండలాల్లో మదర్స్ డే పురస్కరించుకొని ముందస్తు వేడుకలు శనివారం నిర్వహించారు. ప్రాజెక్టు అధికారి పూర్ణిమ ముఖ్య అతిధిగా హాజరై మదర్స్ డే గొప్పతనాన్ని వివరించారు. ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు తల్లుల కాళ్ళు కడిగి నమస్కారం చేసుకున్నారు. చిన్నారులతో తల్లి బొమ్మను డ్రాయింగ్ చేయించి తల్లులకు బహుమతిగా చిన్నారులతో ఇప్పించారు.