జగ్గంపేట మండలంలోని ఒక గ్రామంలో రేషన్ షాపులో బియ్యం బస్తాలనే మాయం చేసేసిన డీలర్. అతని వ్యవహారంపై స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అధికారులు పరీక్షించడానికి వస్తున్నారన్న విషయం తెలుసుకుని బియ్యం బస్తాలు బదులు ఊక బస్తాల్ని షాప్ లో బియ్యం బస్తాలు మాదిరి ఉంచాడు. రెవెన్యూ అధికారులు శుక్రవారం సంబంధిత రేషన్ షాపులో జగ్గంపేట మండల సివిల్ సప్లై అధికారి, గ్రామ రెవెన్యూ అధికారి తనిఖీలు చేసారు. అయితే ఊక బస్తాలనే బియ్యం బస్తాలుగా లెక్కించి స్టాక్ సరిపోయినట్టు తేల్చారు. దీనిపై స్థానికులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో డిఎస్ఓ తనిఖీలో అసలు బండారం బయట పడింది.