జగ్గంపేట: అంగన్వాడీలో సీమంతాల వేడుక

81చూసినవారు
జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో అన్నప్రాసన, సీమంతాల వేడుకను గురువారం నిర్వహించారు. ఐసీడీఎస్ సీడీపీవో పూర్ణిమ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు విషయాలపై మాట్లాడారు. గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. అంగన్వాడీలో ఇచ్చే గుడ్లు, పాలు ఇతర వస్తువులను గర్భిణీ, బాలింత స్త్రీలు మాత్రమే వినియోగించుకోవాలన్నారు. అనంతరం గర్భిణులకు సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన చేశారు.

సంబంధిత పోస్ట్