ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. స్థానిక రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతి పత్రాలు ఎమ్మెల్యే స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ లక్ష్యంగా సీఎం ప్రతి నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం కోసం చక్కని వేదిక ఏర్పాటు చేశారని అన్నారు. పలు సమస్యలపై అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలు పరిష్కరించారు.