జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాల కిట్లను శనివారం జగ్గంపేట మండలం కాండ్రేగుల గ్రామంలో జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తన పార్టీ కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా భావించి ప్రతి క్రియాశీలక సభ్యులకు ఐదు లక్ష రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తున్నారని ఇది రాష్ట్రంలో గాని దేశంలో గాని ఏ రాజకీయ పార్టీ చేయడం లేదన్నారు. పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.