కాకినాడ జిల్లా జగ్గంపేట శివారులోని పోలవరం కాలవ వద్ద శనివారం సాయంత్రం పేకాట ఆడుతున్న ముగ్గురిని జగ్గంపేట ఎస్సై రఘునందన్ రావు, సిబ్బందితో కలిసి దాడి చేసిన జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.10,100 స్వాధీనం చేసుకున్నారు. సోమవారం నాడు నిందితులను కోర్టులో హాజరుపర్చనున్నట్టు తెలిపారు.