కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ పునరుద్ధరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, కేఎస్సీసీఎల్ ఛైర్పర్సన్ షాన్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లో కేఎస్సీసీఎల్ డైరెక్టర్ల బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ షాన్ మోహన్ , కమిషనర్ తోస్మార్ట్ సిటీ ప్రోజెక్ట్ పనులు పై సమీక్షించారు.