ఆలమూరు మండలంలో పెనికేరు కలవచర్ల చింతలూరు ఆలమూరు సరిహద్దుల్లో కోడు కాలువ 20 సంవత్సరాలుగా గుర్రపుడోక్క చెత్తతో పూడుకుపోవటంతో రైతుల భూములు వర్షాకాలం మునిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం చింతలూరు సాగునీటి సంఘం అధ్యక్షులు గారపాటి శ్రీనివాస్ కాలువను పరిశీలించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముంపు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.