స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాజ్ కుమార్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సిఐటియు ఇచ్చిన పిలుపులో భాగంగా జులై 10 న కార్మికుల కోర్కెల దినం సందర్భంగా కాకినాడ మెయిన్ రోడ్డు హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం కాకినాడ నగర కన్వీనర్ మలకా వెంకటరమణ అధ్యక్షతన ధర్నా కార్యక్రమం నిర్వహించారు.