పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలంటూ ఆరోగ్య శాఖ ఉద్యోగులు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రమైన కొత్తపేటలోని పలు కాలనీ ల్లో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రైన్లలో దోమల నివారణ మందును స్ప్రే చేశారు. ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ సద్గుణరావు, ఏఎన్ఎం నాగమణి, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.