గొల్లప్రోలు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎంపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని జ్యోతుల సాయి జ్యోతిని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ప్రత్యేకంగా అభినందించారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో 983 మార్కులు సాధించి కాకినాడ జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొదటి స్థానం సాధించిన సందర్భంగా గురువారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సాయి జ్యోతి సత్కరించి రూ.10 వేల చెక్కును అందజేశారు.