కాకినాడ జిల్లాలో భారీ వర్షం శనివారం తెల్లవారుజామున కురిసింది. గంటన్నరపాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లాలోని ప్రధాన రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం నీట మునిగింది. సాంబమూర్తి నగర్ దుమ్ములపేట డైరీ ఫార్మ్ సెంటర్లలో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. భారీ వర్షంతో చిరు వ్యాపారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.