ఇంధనం పొదుపు చేయడం ద్వారా భావి తరాలకు మంచి భవిష్యత్ ఇవ్వవచ్చని జిల్లా కలెక్టర్ షణ్మోసన్ సగిలి అన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో శుక్రవారం నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ షణ్మోసన్ సగిలి జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి జిజిహెచ్ మీదుగా విద్యుత్ భవనం వరకు విద్యార్థులు, అధికారులు, ఉద్యో గులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు.