భారత్ - పాకిస్తాన్ సరిహద్దులో జరిగిన కాల్పుల్లో వీరమరణం పొందిన భరతమాత ముద్దుబిడ్డ శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన మురళి నాయక్ కి ఎంపీ సానా సతీష్ బాబు కార్యాలయంలో శనివారం ఘన నివాళి అర్పించారు. ఎంపీ అనుచరులు మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగం చేసిన వీర జవాన్లు దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. మురళి నాయక్ చేసిన త్యాగం మరిచిపోలేని ఘట్టమని ఆయన త్యాగానికి పుష్పాంజలి సమర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించి వీరత్వాన్ని స్మరించుకున్నారు.