కాకినాడ: ఆపరేషన్ సింధూర్ కు సైకత శిల్పం

57చూసినవారు
కాకినాడ: ఆపరేషన్ సింధూర్ కు సైకత శిల్పం
ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా కాకినాడలోని ఎన్టీఆర్ బీచ్ లో ఉపాధ్యాయ దంపతులు పిల్లి గోవిందరాజులు, మట్టపర్తి శ్రీదేవి సైకత శిల్పం రూపొందించారు. సముద్రపు ఇసుకలో సైనికుని శిల్పాన్ని గురువారం ఉ.6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తీర్చిదిద్దారు. గోవిందరాజులు చెందుర్తి జడ్పీ హైస్కూళ్లో జీవశాస్త్రం బోధిస్తుండగా. శ్రీదేవి కోనపాపపేట జడ్పీ హైస్కూళ్లో అదే సబ్జెక్టు బోధిస్తున్నారు. వారి సైకత శిల్పాన్ని పలువురు అభినందించారు.

సంబంధిత పోస్ట్