సంక్షోభంలో ఉన్న విద్యా రంగాన్ని పటిష్ట పరచాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ కాకినాడ జిల్లా అధ్యక్షులు నూతంగి ఫిలిప్ రాజు డిమాండ్ చేశారు. శుక్రవారం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద విద్యా రంగాన్ని మెరుగుపరచాలని కోరుతూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఫిలిప్ రాజు మీడియాతో మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలు ఘన నియంగా తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.